ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలిచారు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Updated on: 2025-03-04 12:35:00

గుడివాడ మార్చి04:కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ...కూటమి ప్రగతికి మద్దతుగా నిలిచిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఆలపాటి రాజా అఖండ విజయం సాధించేలా కష్టపడిన టిడిపి - జనసేన - బిజెపి పార్టీల శ్రేణులను ఎమ్మెల్యే రాము అభినందించారు. ప్రతి రౌండ్లో తిరుగులేని మెజార్టీతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించడం గొప్ప విషయం అన్నారు.ఈ ఎన్నికలో పట్టబద్రులు మరియు ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ... కూటమి అభ్యర్థికి ఏకపక్షంగా తమ ఓటు వేయడం సంతోషకరమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రజలు,పట్టభద్రుల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి,ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు