ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి..బొబ్బిలి మాజీ సైనిక సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్
Updated on: 2025-03-21 05:51:00

బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామినాయుడు ఆధ్వర్యంలో గురువారం సభ్యులంతా కలిసి తాసిల్దార్ ఎం శ్రీనును తమ కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా ఆయనకు బొబ్బిలి మాజీ సైనికుల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించవలసిందిగా జిల్లా సైనిక అధికారి ఎం కృష్ణారావు ఇచ్చిన పత్రాన్ని అందజేశారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పూర్తి జీవితాన్ని సరిహద్దుల్లో గడిపి, విధులు నిర్వర్తించి రిటైర్ అయిన మాజీ సైనికులను ప్రోత్సహించాలని, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని, జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు వ్రాసి ఇచ్చిన డేమీ అఫీషియల్ లెటర్ ను తాసిల్దార్ కు ఇచ్చారు. దీనికి తాసిల్దార్ స్పందించి తక్షణమే ప్రభుత్వ భూమిని గుర్తించి త్వరలో మీ అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్, కార్యదర్శి గోవింద నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి రవీంద్ర మోహన్, సిహెచ్ డేవిడ్ తదితర మాజీ సైనికులు పాల్గొన్నారు.