ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యుల సర్వసభ్య సాధారణ సమావేశం
Updated on: 2025-03-31 21:18:00

బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామి నాయుడు అధ్యక్షతన అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్ పర్యవేక్షణలో బొబ్బిలి పాతకోట లో గల సంఘం కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల నిర్వహించిన జిల్లా సైనిక అధికారి నిర్వహించిన క్యాంప్ సదస్సుపై చర్చించారు. క్యాంప్ విజయవంతంగా మీ అందరి సహాయ సహకారాలతో జరిగిందని అధ్యక్షులు తెలియజేశారు. ట్రెజరర్ వి ఎన్ శర్మ మార్చి నెల లో జరిగిన రాబడి, ఖర్చుల వివరాలు సభ్యులకు తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ సంఘము యొక్క అను శాసనం, కార్యనిర్వహణ ,సభ్యుల హాజరు, మంత్లీ సబ్ స్క్రిప్షన్.. తదితర అంశాలపై కూలంకషంగా వివరించారు.చివరగా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ సభ్యులందరూ కోపరేటివ్ గా ఉండాలని, కార్యాలయ మెయింటినెన్స్ ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి మీటింగుకు సభ్యులందరూ హాజరు కావాలని, ప్రతినెలా కటింగ్ అందరూ జమ చేయాలని.. సూచించారు. సభ్యుల వద్ద నుంచి ఇంకా ఏ సజెషన్ పాయింట్ లేనందున సమావేశం 7 గంటలకు ముగిసినది. ఈ సమావేశంలో బొబ్బిలి పరిసర ప్రాంతాల పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.