ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
Updated on: 2025-12-16 20:33:00
75మందికి గాయాలు....
ఉత్తరప్రదేశ్ లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దిల్లీ- ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరో 75 మంది గాయపడినట్లు తెలిపారు. యమునా ఎక్స్ప్రెస్వే మార్గంలోని ఆగ్రా- నోయిడా క్యారేజ్ వేపై ఈ ప్రమాదం జరిగింది.
దట్టమైన పొగమంచు వల్ల వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో భారీగా మంటలు చెలరేగాయని.. బస్సులు, కార్లు నిమిషాల్లోనే దగ్ధమయ్యాయన్నారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక దళాలు, పోలీసు బృందాలు, అంబులెన్స్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు అదుపు చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎక్స్ ప్రెస్ వైపే భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.