ముఖ్య సమాచారం
-
లిక్కర్ కేసులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు.. పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు
-
రాజస్థాన్లోని స్వీట్ షాపుల్లో 'మైసూర్ పాక్' పేరును 'మైసూర్ శ్రీ'గా మార్పు
-
పదవీ విరమణ తర్వాత తాను ఏం చేస్తాడో చెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్
-
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ 2025: వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు
-
వరదల్లో చిక్కుకున్న 50,000 మంది.. నలుగురు మృతి
-
భారత్ మనపై విసిరిన నీటి బాంబును చల్లబరచకపోతే మనం ఆకలితో చనిపోతాం: పాక్ శాసనసభ్యుడు
-
జగన్ Vs సాయిరెడ్డి..తారకరత్న భార్య సంచలన పోస్ట్!
-
పురుషుల పాలిట మృత్యుఘంటికలు మోగిస్తున్న 'బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్'!
-
అండమాన్ నికోబార్ దీవుల గగనతలం మూసివేత... నోటమ్ జారీ!
-
మనకు ఇంకా రెండు ఎస్-400లు రావాలి... రష్యా వెళుతున్న అజిత్ దోవల్
ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు!
Updated on: 2025-05-22 16:10:00

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. హరీశ్ రావు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అందులో స్పష్టం చేశారు.