ముఖ్య సమాచారం
-
ఈనెల 10 వరకు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు బంద్
-
ఏపీ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ను విధుల నుంచి తొలగించిన ఏపీ సర్కార్
-
'షైనింగ్ స్టార్స్' పేరిట ప్రభుత్వం అవార్డులు
-
ఇకపై UPSC పరీక్షలకు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి
-
పిల్లల చదువుల కోసం డ్వాక్రా మహిళలకు భరోసా.
-
పవన్ కల్యాణ్ను దూషించిన కేసులో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
-
విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు
-
బీజాపూర్ లో బీకర ఎన్కౌంటర్.. అడెల్లుతో సహా కీలక ఏడుగురు మావోయిస్టులు మృతి..
-
టీడీపీ కీలక నిర్ణయం.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేరికలు..!
-
రాజకీయ పార్టీ పెడుతున్న మస్క్.. పేరు కూడా ఖరారు!
ఫిజియోథెరపీ పేరుతో ఇంట్లోకి చొరబడి... హైదరాబాద్ లో వృద్ధ దంపతుల దారుణ హత్య
Updated on: 2025-06-06 20:57:00

రాజేంద్రనగర్ జనచైతన్య కాలనీ ఫేజ్-2లో నివాసముంటున్న షేక్ అబ్దుల్లా (70), ఆయన సతీమణి రిజ్వానా (65) దారుణ హత్యకు గురయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఉన్నతోద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందిన అబ్దుల్లా, లెక్చరర్గా రిటైరైన రిజ్వానా దంపతులు ఇటీవలే ఈ ప్రాంతంలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. సుమారు 40 రోజుల క్రితమే గృహప్రవేశం చేసి, ప్రశాంత జీవితం గడుపుతున్నారు.
గురువారం సాయంత్రం, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వీరి ఇంటికి వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారిలో ఒకరు ముఖానికి మాస్క్, తలకు టోపీ ధరించగా, మరొకరు బురఖాలో ఉన్నారు. "ఫిజియోథెరపీ చేయడానికి వచ్చాం" అని వాచ్మన్కు చెప్పి, దంపతులు ఉంటున్న పైఅంతస్తులోకి వెళ్లారు. సుమారు గంటన్నర తర్వాత, ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. శుక్రవారం ఉదయం ఎంతసేపటికీ దంపతులు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తలుపులు పగలగొట్టి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధ దంపతుల మృతదేహాలు కనిపించాయి.