ముఖ్య సమాచారం
-
ఈనెల 10 వరకు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు బంద్
-
ఏపీ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ను విధుల నుంచి తొలగించిన ఏపీ సర్కార్
-
'షైనింగ్ స్టార్స్' పేరిట ప్రభుత్వం అవార్డులు
-
ఇకపై UPSC పరీక్షలకు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి
-
పిల్లల చదువుల కోసం డ్వాక్రా మహిళలకు భరోసా.
-
పవన్ కల్యాణ్ను దూషించిన కేసులో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
-
విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు
-
బీజాపూర్ లో బీకర ఎన్కౌంటర్.. అడెల్లుతో సహా కీలక ఏడుగురు మావోయిస్టులు మృతి..
-
టీడీపీ కీలక నిర్ణయం.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేరికలు..!
-
రాజకీయ పార్టీ పెడుతున్న మస్క్.. పేరు కూడా ఖరారు!
టీడీపీ కీలక నిర్ణయం.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేరికలు..!
Updated on: 2025-06-07 16:20:00

ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటిమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేరికలు భారీగా పెరిగిపోయాయి.. అయితే, ఇప్పుడు అదే పార్టీకి సమస్యగా మారిందా? అనే చర్చ సాగుతోంది.. దానికి అనుగుణంగా టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిపోయింది..
ఇతర పార్టీ నాయకులు టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను జాయిన్ చేసుకోవాలి.. వాళ్లపై విచారణ తర్వాత పార్టీ అనుమతితో పార్టీలోకి ఆహ్వానించాలని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..
టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరుతో విడుదలైన ఆ ప్రకటనలో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను టీటీడీలోకి జాయిన్ చేసుకునేముందు తప్పని సరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. వారి గురించి పూర్తి కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత.. పార్టీ అనుమతితో వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది.. ఈ విషయాన్ని టీడీపీలోని వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు
పల్లా శ్రీనివాసరావు.. ఈ విషయాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, నియోజకవర్గ పరిశీలకు సూచించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.
కాగా, మహానాడు సహా ఇతర సమావేశాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారు.. వారితో జాగ్రత్త.. ఇక్కడి విషయాలు అక్కడకి చేరిపోతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ నేతలు, శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు టీడీపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది..