ముఖ్య సమాచారం
-
భారీ వర్షాలు.. 56 మంది మృతి
-
హైదరాబాద్కు కేంద్రం గుడ్ న్యూస్: 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు
-
కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
-
ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు.*
-
ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు...
-
హార్వర్డ్కు ట్రంప్ సర్కార్ షాక్: అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!
-
కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు.. కదలికలపై పోలీసుల నిఘా
-
కోవిడ్ -19 వ్యాప్తి..ఏపీ సర్కార్ కీలక సూచనలు
-
14 సెకండ్లు నేలపై వెలిగిన పిడుగు వెలుతురు.... భయాందోళనకు గురైన ప్రజలు
-
ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు!
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే
Updated on: 2025-05-22 11:17:00

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు. గత నెలలో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ వెళుతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి తన నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు.