ముఖ్య సమాచారం
-
ఇజ్రాయెల్ ను ఖాళీ చేయండి: తమ ప్రజలకు చైనా హెచ్చరిక
-
పశ్చిమాసియాలో ఎగరని విమానాలు
-
తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
-
వాట్సాప్ లో ఇకపై యాడ్స్!
-
టెహ్రాన్ను వదిలిన 100 మందితో కూడిన భారతీయుల తొలి బృందం
-
తల్లికి వందనంకు’ కుల ధ్రువపత్రం అవసరం లేదు
-
తగలబడుతున్న టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ చానెల్
-
మరో ముంబైగా విశాఖ నగరం,,,,చంద్రబాబు
-
గిన్నిస్ రికార్డు సాధిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్!
గిన్నిస్ రికార్డు సాధిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
Updated on: 2025-06-17 07:21:00

"11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు విశాఖ అనువైన ప్రదేశం, మీరు చేయగలుగుతారని ప్రధాని మోదీ చెప్పగానే విజయవంతంగా చేస్తామని చెప్పా. యోగాను ప్రపంచమంతా జరుపుకునేలా ప్రధాని మోదీ కృషి చేశారు. 21వ తేదీన పౌరులు పాల్గొనేందుకు ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సుందర నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయడం మన అదృష్టం. యోగా భవిష్యత్తులో అందరి జీవితంలో భాగం కావాలి. టెక్నాలజీ యుగంలో తీరికలేకుండా గడుపుతున్నాం. అందరిలో ఉండే ఆందోళన, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు యోగా పరిష్కారం. రాష్ట్రంలో యోగాంధ్ర థీమ్తో నెలరోజులపాటు కార్యక్రమం చేపట్టాం. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నెల రోజులుగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 1 లక్ష ప్రదేశాల్లో నిర్వహిస్తాం. 2 కోట్లమంది యోగా డేలో పాల్గొంటారు. ఇప్పటికే 2.17 కోట్లమంది పాల్గొంటామని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇస్తాం. గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తున్నాం..తప్పకుండా సాధిస్తాం".