ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
Updated on: 2025-12-15 06:20:00
బొబ్బిలి మండలంలో శివారు గిరిజన గ్రామాలయిన చిన్న మోసూరు వలస, చిలకమ్మ వలస, ఎరకందరవలస, సీయోను వలస, విజయపురి తదితర గిరిజన గ్రామాల్లో ఆదివారం బొబ్బిలి మాజీ సైనికుల సంక్షేమ సంఘము అధ్యక్షులు రేవళ్ల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు మరడ రామునాయుడు పర్యవేక్షణలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ మానవసేవ, సామాజిక బాధ్యతలో భాగంగా నిరుపేదలకు, అభాగ్యులకు అండగా నిలవడం.. చలికాలంలో వృద్ధులకు వెచ్చదనాన్ని అందించడం, వారి కష్టాలను తగ్గించడం మాజీ సైనికులు బాధ్యతగా తీసుకున్నారన్నారు. మండలంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో చలి తీవ్రత పెరిగిందన్నారు. గౌరవ అధ్యక్షులు రామినాయుడు మాట్లాడుతూ వృద్ధులు ఇబ్బందులు పడకుండా తమ వంతు బాధ్యతగా సంఘం సభ్యులు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు
అలాగే మహిళలకు పిల్లలకు వస్త్రములు, టువ్వాళ్ళు, పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వంద మంది వృద్ధులకు దుప్పట్లు అందజేశారు.. బాలింత మహిళకు 500 రూపాయలు చీర పసుపు కుంకుమలు అందించారు కార్యక్రమంలో కార్యదర్శి ఏ గోవింద నాయుడు ఉప కార్యదర్శి ఎస్ ఆర్ మోహన్ రావు, వనమిత్ర కృష్ణ దాస్, సభ్యులు భోగి ఈశ్వరరావు సి హెచ్ మోహన్, సిహెచ్ త్రివేది, చంద్రమౌళి, పి నాగేశ్వరరావు, వియన్ శర్మ, పాండ్రంకి రవి, తదితరులు పాల్గొన్నారు.