ముఖ్య సమాచారం
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి..
Updated on: 2023-05-07 16:46:00

ఆరు మాసాలుగా నిధుల విడుదల నిలిపివేత పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం చెందారు.
కేంద్రం నిధులు ఇవ్వడం లేదనీ రాష్ట్రం.. యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వడంలేదని కేంద్రం..ఒకరి పై ఒకరు ఆరోపణలు..చేసుకుని
సర్పంచుల హక్కులు కాల రాస్తున్నారు. దానివల్ల అప్పుల ఉబిలోకి సర్పంచులు కూరుకుపోయారు.
వచ్చిన నిధులను డిజిటల్ కీ తో సర్పంచులు తెలియకుండా డ్రా చేశారని, ఆ నిధులు
ఆత్మహత్యలు చేసుకొకముందే మాకు ఇవ్వండి అంటూ సర్పంచుల ఆవేదన చెందుతున్నారని జీవన్ రెడ్డి తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో జీవన్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి,చలో ఎన్ ఆర్ ఐ సెల్ అధ్వర్యంలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గ్రామాల్లో హరితహారం వైకుంఠధామాలు డంపింగ్ యార్డులు పల్లె ప్రకృతి వనాలు క్రీడా మైదానాలు పారిశుద్ధ్య నిర్వహణ తాగునీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచులు, పాలక మండలి సభ్యులు విజయవంతంగా చేపడుతున్నారు.
రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచులకు ఆరు మాసాలుగా నిధులు మంజూరు కాకపోవడంతో అప్పుల పాలయ్యారు.ఒక్కొక్క సర్పంచ్ కు రు. 20 నుండి రు.50 లక్షల నిధులు రావాల్సి ఉన్నాయి.
బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సర్పంచులు బిల్లులు రాక బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి నెలకొందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.