ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి..
Updated on: 2023-05-07 16:46:00
ఆరు మాసాలుగా నిధుల విడుదల నిలిపివేత పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం చెందారు.
కేంద్రం నిధులు ఇవ్వడం లేదనీ రాష్ట్రం.. యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వడంలేదని కేంద్రం..ఒకరి పై ఒకరు ఆరోపణలు..చేసుకుని
సర్పంచుల హక్కులు కాల రాస్తున్నారు. దానివల్ల అప్పుల ఉబిలోకి సర్పంచులు కూరుకుపోయారు.
వచ్చిన నిధులను డిజిటల్ కీ తో సర్పంచులు తెలియకుండా డ్రా చేశారని, ఆ నిధులు
ఆత్మహత్యలు చేసుకొకముందే మాకు ఇవ్వండి అంటూ సర్పంచుల ఆవేదన చెందుతున్నారని జీవన్ రెడ్డి తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో జీవన్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి,చలో ఎన్ ఆర్ ఐ సెల్ అధ్వర్యంలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గ్రామాల్లో హరితహారం వైకుంఠధామాలు డంపింగ్ యార్డులు పల్లె ప్రకృతి వనాలు క్రీడా మైదానాలు పారిశుద్ధ్య నిర్వహణ తాగునీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచులు, పాలక మండలి సభ్యులు విజయవంతంగా చేపడుతున్నారు.
రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచులకు ఆరు మాసాలుగా నిధులు మంజూరు కాకపోవడంతో అప్పుల పాలయ్యారు.ఒక్కొక్క సర్పంచ్ కు రు. 20 నుండి రు.50 లక్షల నిధులు రావాల్సి ఉన్నాయి.
బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సర్పంచులు బిల్లులు రాక బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి నెలకొందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.