ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీకే మా మద్దతు
Updated on: 2023-10-28 21:42:00
సిద్దిపేట జిల్లా:నవంబర్ 18న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షల మందితో మాదిగల విశ్వరూప మహా సభ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు.శనివారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో మాదిగల విశ్వరూప మహా సభలో మందకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుందన్నారు.ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగినప్పుడే వారి పిల్లల చదువులు బాగుపడతాయని. చదువుకున్నవారికి ఉద్యోగాలు వస్తాయన్నారు.అన్ని పార్టీలలో ఉన్నటువంటి దళితులందరు హైదరాబాదులో జరిగే మహాసభకు పార్టీలకు ఆతీతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మాకు మద్దతు పలకాలన్నారు.ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తామని స్పష్టత ఇస్తే ఆ పార్టీకే తాము మద్దతు పలుకుతామని మందకృష్ణ మాదిగ వెల్లడించారు.