ముఖ్య సమాచారం
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీకే మా మద్దతు
Updated on: 2023-10-28 21:42:00
సిద్దిపేట జిల్లా:నవంబర్ 18న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షల మందితో మాదిగల విశ్వరూప మహా సభ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు.శనివారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో మాదిగల విశ్వరూప మహా సభలో మందకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుందన్నారు.ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగినప్పుడే వారి పిల్లల చదువులు బాగుపడతాయని. చదువుకున్నవారికి ఉద్యోగాలు వస్తాయన్నారు.అన్ని పార్టీలలో ఉన్నటువంటి దళితులందరు హైదరాబాదులో జరిగే మహాసభకు పార్టీలకు ఆతీతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మాకు మద్దతు పలకాలన్నారు.ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తామని స్పష్టత ఇస్తే ఆ పార్టీకే తాము మద్దతు పలుకుతామని మందకృష్ణ మాదిగ వెల్లడించారు.