ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
నేడు భద్రాద్రిలో కేటీఆర్ పర్యటన..రామాలయ దర్శనం, రోడ్ షో
Updated on: 2023-11-19 09:45:00

రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు.హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో ఉదయం భద్రాచలం నగరానికి చేరుకుంటారు.11 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం ఉంటుంది.అనంతరం బీఆర్ ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తైలం వెంకట్రావు విజయాన్ని కాంక్షిస్తూ నగరంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.మధ్యాహ్నం ఒంటిగంటకు ఇల్లెందు నగరానికి చేరుకుంటారు.బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియానాయక్ విజయాన్ని కాంక్షిస్తూ అక్కడ రోడ్ షో నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా కేంద్రం కొత్తగూడెం చేరుకుంటారు.అక్కడ బీఆర్ ఎస్ అభ్యర్థి వన్మా వెంకటేశ్వరరావు గెలుపు కోసం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.సాయంత్రం 4 గంటలకు అశ్వారావుపేటకు చేరుకుంటారు.బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షోలో పాల్గొంటారు.బీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి రావడంతో పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది.కాగా,మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మధు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.