ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
బీసీలను మభ్యపెడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు
Updated on: 2023-11-22 12:35:00
ఓట్ల కోసం బీసీలకు ఇది చేస్తాం అది చేస్తాం అని మభ్యపెట్టటమే తప్పా జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు బీసీలకు ఒరుగపెట్టింది ఏమి లేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ లు అన్నారు.కరీంనగర్ లోని జ్యోతినగర్ లో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజవర్గం లో రెండు సీట్లు బీసీలకు ఇస్తామని మోసం చేసిందని అలాగే బీసీలకు పాలన చేతకాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనడం బీసీలను అవమాన పరడమే అని ఆ వాక్యాలను బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. బీజేపీ పార్టీ తాము అధకారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అంటున్నారని కానీ బీసీల జనగణన జరిపి చట్ట సభల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదని అన్నారు.బీసీ ముఖ్యమంత్రి వల్ల ఏమి ప్రయోజనమని అధికారం అంతా కేంద్ర అధిష్టానం చేతిలో ఉంటుందని తెలిపారు.కాబట్టి కరీంనగర్ లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించి,బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిన మరియు నియోజక వర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ కు ఓటు వేయాలని బీసీ విద్యార్థి సంఘం పట్టణ అధ్యక్షుడు అజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు.