ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
బీసీలను మభ్యపెడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు
Updated on: 2023-11-22 12:35:00
ఓట్ల కోసం బీసీలకు ఇది చేస్తాం అది చేస్తాం అని మభ్యపెట్టటమే తప్పా జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు బీసీలకు ఒరుగపెట్టింది ఏమి లేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ లు అన్నారు.కరీంనగర్ లోని జ్యోతినగర్ లో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజవర్గం లో రెండు సీట్లు బీసీలకు ఇస్తామని మోసం చేసిందని అలాగే బీసీలకు పాలన చేతకాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనడం బీసీలను అవమాన పరడమే అని ఆ వాక్యాలను బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. బీజేపీ పార్టీ తాము అధకారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అంటున్నారని కానీ బీసీల జనగణన జరిపి చట్ట సభల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదని అన్నారు.బీసీ ముఖ్యమంత్రి వల్ల ఏమి ప్రయోజనమని అధికారం అంతా కేంద్ర అధిష్టానం చేతిలో ఉంటుందని తెలిపారు.కాబట్టి కరీంనగర్ లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించి,బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిన మరియు నియోజక వర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ కు ఓటు వేయాలని బీసీ విద్యార్థి సంఘం పట్టణ అధ్యక్షుడు అజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు.