ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్గా మారింది:ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు
Updated on: 2023-11-25 16:52:00
కామారెడ్డి:వాగ్దానం ఇచ్చామంటే అమలు చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని చెప్పారు.కామారెడ్డి నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం దక్కిందని అన్నారు.టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్గా మారిందని,యూపీఏ కాస్త ఇండియా కూటమిగా మారిపోయిందని విమర్శించారు.ఇక్కడ జన ప్రవాహం కనిపిస్తోంది. తొమ్మిదేళ్ల వారి పాలనపై ప్రజలు విసిగిపోయారు.ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుంచి విముక్తి కోరుతున్నారు.ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా విధానాలు ఉన్నాయి.నేను ఇచ్చే మాటలే గ్యారంటీ. దేశానికి బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనే.తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు డబ్బులు అవసరమైనా అప్పుడు నీటి పారుదల పథకాలు పెట్టుకున్నారు.ప్రజాధనం అంతా కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళింది అని మోదీ అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆదివారం,సోమవారం కూడా ప్రచారం నిర్వహించనున్నారు.