ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
Updated on: 2023-12-02 18:15:00
కర్నూలు:కర్నూలు మెడికల్ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది.సీనియర్ల వేధింపుల పై ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది.తమ రికార్డులు రాసి పెట్టాలని,తమ గదికి భోజనాలు తీసుకురావాలని సీనియర్లు వేధిస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై కలగజేసుకోవాలని,తమకు వేధింపులు తప్పేలా చర్యలు తీసుకోవాలని జూనియర్ విద్యార్థులు యూజీసీకి లేఖ రాశారు.ఈ ఫిర్యాదుతో స్పందించిన యూజీసి ర్యాగింగ్ విషయాన్ని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది.కాలేజీలో,విద్యార్థుల హాస్టల్స్లో ర్యాగింగ్ నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఇటీవలే కాలేజీ అనుబంధంగా ఉన్న మెన్స్ హాస్టల్లో గంజాయి,మద్యం సీసాలు బయటపడడం సంచలనం సష్టించింది.దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈలోపే కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది.