ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
వార్షిక తనిఖీలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డిఐజి
Updated on: 2023-12-26 21:23:00
అనకాపల్లి జిల్లా:విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను,సబ్ డివిజన్ కార్యాలయ్యాల్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. నేరాలను అరికట్టటలో గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసుల పాత్ర కీలకమని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ తెలిపారు.జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలోని అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సమాచారాన్ని డీఐజీ కి వివరించారు.డీఐజీ సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ పరిసరాలను,ఎస్.హెచ్.ఓ,రైటర్, కంప్యూటర్ గదులను,కేస్ ప్రాపర్టీ భద్రపరిచిన గదిని పరిశీలించి,కేసు ప్రాపర్టీ సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసుల సహాయంతో బాల్యవివాహాలను అరికట్టాలని, సైబర్ క్రైమ్స్, రోడ్డు భద్రతా నియమాలు గూర్చి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు.పోలీస్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి,రౌడీలు,సస్పెక్ట్ లు,పాత నేరస్తులు ఎవరు ఉన్నారు, వారి కదలికలు గురించిన వివరాలను, స్థల వివాదాలు,కుటుంబ తగాదాలు,వర్గ విభేదాలు గురించిన సమాచారాన్ని, గతంలో ఎటువంటి నేరాలు జరిగినయి, అందులో ముద్దాయిలు ఎవరు బాధితులు ఎవరు వారి ప్రస్తుత జీవన విధానం వంటి విషయాల గురించి విపులంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం అనకాపల్లి సబ్ డివిజన్ కార్యాలయా రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.