ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
Updated on: 2024-01-26 21:59:00

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ , జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ జాతీయ పతాకావిష్కరణ చేసి సిబ్బందికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26న భారతదేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని , స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారతదేశంలో పరిపాలన కొరకు అత్యంత ఆవశ్యకత కలిగిన తన సొంత రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించుకుని, రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందన, అప్పటి నుంచి దేశం ప్రజాతంత్ర పరిపాలన కలిగిన సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు. అనంతరం అనకాపల్లి పట్టణం, ఎన్.టి.అర్ మైదానం నందు పోలీసుల నుండి జిల్లా కలెక్టర్ , ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ గారు ఎగురవేసి, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పోలీసు పరేడ్ ను పరిశీలించారు.