ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
Updated on: 2024-01-26 21:59:00
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ , జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ జాతీయ పతాకావిష్కరణ చేసి సిబ్బందికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26న భారతదేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని , స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారతదేశంలో పరిపాలన కొరకు అత్యంత ఆవశ్యకత కలిగిన తన సొంత రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించుకుని, రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందన, అప్పటి నుంచి దేశం ప్రజాతంత్ర పరిపాలన కలిగిన సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు. అనంతరం అనకాపల్లి పట్టణం, ఎన్.టి.అర్ మైదానం నందు పోలీసుల నుండి జిల్లా కలెక్టర్ , ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ గారు ఎగురవేసి, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పోలీసు పరేడ్ ను పరిశీలించారు.