ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
Updated on: 2024-01-26 21:59:00
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ , జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ జాతీయ పతాకావిష్కరణ చేసి సిబ్బందికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26న భారతదేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని , స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారతదేశంలో పరిపాలన కొరకు అత్యంత ఆవశ్యకత కలిగిన తన సొంత రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించుకుని, రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందన, అప్పటి నుంచి దేశం ప్రజాతంత్ర పరిపాలన కలిగిన సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు. అనంతరం అనకాపల్లి పట్టణం, ఎన్.టి.అర్ మైదానం నందు పోలీసుల నుండి జిల్లా కలెక్టర్ , ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ గారు ఎగురవేసి, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పోలీసు పరేడ్ ను పరిశీలించారు.