ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ గదిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
Updated on: 2024-01-28 11:41:00

నంద్యాల జిల్లా:ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో విద్యార్థిని ప్రసవించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాణ్యం శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. కాలేజీకి సంబంధించిన హాస్టల్ లోనే ఉంటూనే చదువు కొనసాగిస్తోంది.శనివారం రాత్రి 9 గంటలకు బాత్రూమ్ లో సదరు విద్యార్థిని పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.రక్తస్రావం ఎక్కువగా కావడంతో మెరుగైన చికిత్స కోసం నంద్యాల జిల్లా ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ విద్యార్థిని చనిపోయింది.కాలేజీ యజమాన్యం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.