ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ గదిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
Updated on: 2024-01-28 11:41:00
నంద్యాల జిల్లా:ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో విద్యార్థిని ప్రసవించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాణ్యం శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. కాలేజీకి సంబంధించిన హాస్టల్ లోనే ఉంటూనే చదువు కొనసాగిస్తోంది.శనివారం రాత్రి 9 గంటలకు బాత్రూమ్ లో సదరు విద్యార్థిని పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.రక్తస్రావం ఎక్కువగా కావడంతో మెరుగైన చికిత్స కోసం నంద్యాల జిల్లా ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ విద్యార్థిని చనిపోయింది.కాలేజీ యజమాన్యం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.