ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
చెర్వుగట్టు జాతర ఈ నెల 14 నుంచి 21 వరకు
Updated on: 2024-02-13 07:03:00
నార్కట్పల్లి, ఫిబ్రవరి 12 : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 14 నుంచి 21 వరకు జరిగే జాతరకు జిల్లా అధికారులు, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు బ్రహ్మోత్సవాలకు సుమారు 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని దేవాలయ సిబ్బంది అంచనా.ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు నల్లగొండలోని రామాలయం నుంచి నగరోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 16న శుక్రవారం రాత్రి(తెల్లవారితే శనివారం17వ తేది) స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 18న ఆదివారం (తెల్లవారితే సోమవారం) స్వామి వారి అగ్నిగుండాలు, 19న సోమవారం(తెల్లవారితే మంగళవారం) దోపోత్సవం, అశ్వవాహన సేవ జరుపుతారు. 20న మంగళవారం రాత్రి మహా పూర్ణావృతి, పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. 21న బుధవారం సాయంత్రం 4 గంటలకు గజ వాహనంపై చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు పరిపూర్ణం చేస్తారు.