ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ఘనంగా మేడారంలో మండే మెలిగే పండుగ
Updated on: 2024-02-14 20:33:00

ములుగు జిల్లాలోని మేడారం మహజాతరకు అంకురార్పణ జరిగింది. ఈరోజు మండమెలిగే పండుగను గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, కొండాయి లో గోవిందరాజు, పూనుగుండ్లలో పగిడిద్దరాజు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మల వనదేవతలకు దిష్టి తగలకుండా ఊరు చుట్టూ రక్షబంధనం ఏర్పాటు చేశారు. అమ్మవార్ల ఆలయం ముందు రోడ్డుకు ఇరువైపులా కర్రలు పాతి కోడి, మామిడాకులు, పండుమిరపకాయలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ జరుపుకున్నట్లు పూజారులు చేశారు. ఫిబ్రవరి 21 నుండి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మేడారం మహాజాతర జరగనుంది.