ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
గద్దెకు చేరిన సారలమ్మ
Updated on: 2024-02-22 08:41:00

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో మొదటి ఘట్టం ముగిసింది. సారలమ్మ నిన్న గిరిజన పూజారుల, భక్తుల కోలాహలం మధ్య రాత్రి 12: 18 నిమిషాలకు గద్దెకు చేరుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క పర్యవేక్షణ లో సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు అయ్యాక గోవిందా రాజు లు, పగిడిద్దా రాజు లతో కలిసి గద్దెకి సారాలమ్మ గద్దెకు చేరి మొక్కులు పొందుతున్నారు. రెండు గంటలు కన్నెపల్లి సారాలమ్మా గుడిలో జరిగిన పూజల అనంతరం ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెల మీదకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ లు సారాలమ్మాలకు ప్రత్యేక పూజలు చేసి కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి గిరిజన సాంప్రదాయ నృత్యం చేసారు.