ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
గద్దెకు చేరిన సారలమ్మ
Updated on: 2024-02-22 08:41:00
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో మొదటి ఘట్టం ముగిసింది. సారలమ్మ నిన్న గిరిజన పూజారుల, భక్తుల కోలాహలం మధ్య రాత్రి 12: 18 నిమిషాలకు గద్దెకు చేరుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క పర్యవేక్షణ లో సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు అయ్యాక గోవిందా రాజు లు, పగిడిద్దా రాజు లతో కలిసి గద్దెకి సారాలమ్మ గద్దెకు చేరి మొక్కులు పొందుతున్నారు. రెండు గంటలు కన్నెపల్లి సారాలమ్మా గుడిలో జరిగిన పూజల అనంతరం ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెల మీదకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ లు సారాలమ్మాలకు ప్రత్యేక పూజలు చేసి కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి గిరిజన సాంప్రదాయ నృత్యం చేసారు.