ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలను మార్చండి
Updated on: 2024-03-12 04:36:00
కరెంటు తీగలు తెగి పడటం వల్ల పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు సోమవారం విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు తుప్పు పట్టడంతో కాలం చెల్లిపోయాయని, విద్యుత్ తీగలు తెగడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ శాశ్వత పరిష్కారం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కూడా విద్యుత్ తీగల తెగి కట్టెలపై పడటంతో భారీ ఎత్తున మంటలు చేరడానికి స్థానికంగా ఇబ్బందులు పడినట్లు గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నపాటి గాలి వానలకు తెగిపడితే ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామ సభలో కూడా వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కాలం చెల్లిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.