ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్
Updated on: 2024-03-12 19:19:00
వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం గద్వాల్ పరిధిలోని గోనుపాడు గ్రామంలో మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరాను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేసవిలో త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. నీరు వృధా కాకుండా చూడాలని, ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని సూచించారు. లీకేజీలు లేకుండా చూసుకోవాలని, తెలిపారు. ఈ సందర్భంగా త్రాగు నీరు, బల్క్ వాటర్ సౌలభ్యత, నీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయితి కార్యాలయంలో నీటి సరఫరాకు సంబంధించిన ఏడు రిజిస్టర్లను, క్లోరోస్కోప్ ద్వారా నీటి స్వచ్ఛతను పరిశీలించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.