ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్
Updated on: 2024-03-12 19:19:00

వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం గద్వాల్ పరిధిలోని గోనుపాడు గ్రామంలో మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరాను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేసవిలో త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. నీరు వృధా కాకుండా చూడాలని, ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని సూచించారు. లీకేజీలు లేకుండా చూసుకోవాలని, తెలిపారు. ఈ సందర్భంగా త్రాగు నీరు, బల్క్ వాటర్ సౌలభ్యత, నీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయితి కార్యాలయంలో నీటి సరఫరాకు సంబంధించిన ఏడు రిజిస్టర్లను, క్లోరోస్కోప్ ద్వారా నీటి స్వచ్ఛతను పరిశీలించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.