ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
సాలూరు: రెండో సారి తలపడుతున్న రాజన్నదొర సంధ్యారాణి.
Updated on: 2024-03-16 21:35:00
సాలూరు: సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ప్రధాన పార్టీల అభ్యర్థులెవరో తేలిపోవడంతో నియోజకవర్గం లో ఎన్నికల వేడి రాజుకుంది.టిడిపి అభ్యర్థిగా సంధ్యారాణి ని ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.సంధ్యారాణి మొదటి సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా 1999 ఎన్నికల్లో పోటీ చేశారు.అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి ఎల్ ఎన్ సన్యాసి రాజు చేతిలో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాజన్నదొర చేతిలో ఓటమి పాలయ్యారు.ఇప్పుడు మళ్ళీ టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.ఆమె 2014 ఎన్నికల్లో అరుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంధ్యారాణి విద్యావంతురాలు, మాటకారి.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆమెకు టిడిపి అధిస్థానం ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చింది.ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఇంతవరకు గెలిచిన సందర్భాలు లేవు.2024 ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.