ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
సాలూరు: రెండో సారి తలపడుతున్న రాజన్నదొర సంధ్యారాణి.
Updated on: 2024-03-16 21:35:00

సాలూరు: సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ప్రధాన పార్టీల అభ్యర్థులెవరో తేలిపోవడంతో నియోజకవర్గం లో ఎన్నికల వేడి రాజుకుంది.టిడిపి అభ్యర్థిగా సంధ్యారాణి ని ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.సంధ్యారాణి మొదటి సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా 1999 ఎన్నికల్లో పోటీ చేశారు.అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి ఎల్ ఎన్ సన్యాసి రాజు చేతిలో ఓడిపోయారు.2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాజన్నదొర చేతిలో ఓటమి పాలయ్యారు.ఇప్పుడు మళ్ళీ టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.ఆమె 2014 ఎన్నికల్లో అరుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంధ్యారాణి విద్యావంతురాలు, మాటకారి.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆమెకు టిడిపి అధిస్థానం ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చింది.ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఇంతవరకు గెలిచిన సందర్భాలు లేవు.2024 ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.