ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
యువకుడిపై కత్తితో దాడి - మరో యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం- పోలీసు ఔట్ పోస్టు వద్ద ఘటన
Updated on: 2024-04-22 19:17:00
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి చౌరస్తా ఔట్ పోస్టు వద్ద సోమవారం యువకుడు గంజాయి మత్తులో ఒక యువకుడిపై కత్తితో దాడీ చేయగా మరో యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు ఊపిరిపీల్చుకుంటుండగా నగరంలోని అర్సపల్లి చౌరస్తాలోని పోలీసు ఔట్ పోస్టు వద్ద గంజాయి సేవించి కత్తితో దాడికి పాల్పడ్డ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. గాయపడిన యువకుడిని ఫిరోజ్ ఖాన్ గా గుర్తించగా పొడిచిన యువకుడిని అక్రమ్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. పోలీసు ఔట్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగినప్పుడు పోలీసు సిబ్బంది ఉండగానే అక్రమ్ ఖాన్ కత్తితో ఫిరోజ్ ఖాన్ పై దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు పాతకక్ష్యలు కారణమని తెలుస్తోంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్ కలుగజేసుకుని ఫిరోజ్ ఖాన్ కు రక్షించారు. స్థానికులు ఫిరోజ్ ఖాన్ ను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. గంజాయి మత్తులో ఉన్న అక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.