ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
యువకుడిపై కత్తితో దాడి - మరో యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం- పోలీసు ఔట్ పోస్టు వద్ద ఘటన
Updated on: 2024-04-22 19:17:00
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి చౌరస్తా ఔట్ పోస్టు వద్ద సోమవారం యువకుడు గంజాయి మత్తులో ఒక యువకుడిపై కత్తితో దాడీ చేయగా మరో యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు ఊపిరిపీల్చుకుంటుండగా నగరంలోని అర్సపల్లి చౌరస్తాలోని పోలీసు ఔట్ పోస్టు వద్ద గంజాయి సేవించి కత్తితో దాడికి పాల్పడ్డ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. గాయపడిన యువకుడిని ఫిరోజ్ ఖాన్ గా గుర్తించగా పొడిచిన యువకుడిని అక్రమ్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. పోలీసు ఔట్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగినప్పుడు పోలీసు సిబ్బంది ఉండగానే అక్రమ్ ఖాన్ కత్తితో ఫిరోజ్ ఖాన్ పై దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు పాతకక్ష్యలు కారణమని తెలుస్తోంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్ కలుగజేసుకుని ఫిరోజ్ ఖాన్ కు రక్షించారు. స్థానికులు ఫిరోజ్ ఖాన్ ను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. గంజాయి మత్తులో ఉన్న అక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.