ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
Updated on: 2024-04-29 10:40:00
కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తిని మదనపల్లె తాలూకా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి సీఐ శేఖర్, ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. మదనపల్లె మండలం, బెంగుళూరు రోడ్డు, చీకలబైలు పంచాయతీ, బార్లపల్లికి చెందిన రామస్వామి కొడుకు గారడి బాలాజీ (32), కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా 12 వేల విలువైన మద్యం ప్యాకెట్లు తీసుకువచ్చి, గ్రామస్తులకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే ఎస్ఐ వెంకటేష్, సిబ్బందితో వెళ్లి, బాలాజీ ఇంట్లో అమ్మకానికి సిద్ధంగా వున్న కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను సీజ్ చేసి, కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామని సీఐ తెలిపారు.