ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
రాష్ట్రాభివృద్ధికి బిజెపి భరోసా * ధర్మవరంలో బిజెపిలోకి చేనేతల చేరికలు
Updated on: 2024-05-05 09:46:00
ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు బిజెపి భరోసా కల్పిస్తోందని బిజెపి నేషనల్ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ పేర్కొన్నారు. పట్టణంలోని బిజెపి కార్యాలయంలో శనివారం చేనేత నాయకులు ఎర్రజోడు లోకేష్ , ఎర్రజోడు చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో పలువులు చేనేతలు బిజెపిలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అరుణ్ సింగ్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో చితికిపోయిన రాష్ట్రాన్ని బిజెపి టిడిపి ,జనసేన పార్టీలతో కలిసి అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ నమ్మకంతోనే ఎంతోమంది బిజెపి మీద విశ్వాసంతో పార్టీలోకి చేరుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని చెప్పారు.