ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
దళితులపై వైసీపీ చిన్నచూపు : పులివర్తి నాని
Updated on: 2024-05-07 20:44:00
టీడీపీలో చేరిన దళిత నేత పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పులివర్తి నాని. వైసీపీ ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపు చూస్తోందని తిరుపతి రూరల్ మండలం, శ్రీనివాసపురంకు చెందిన వైసీపీ దళిత నేత పవన్ కళ్యాణ్ (బిట్టు) ఆరోపించారు. మంగళవారం ఆయనతో పాటు ఎంపీటీసీ లావణ్య, శేఖర్ రెడ్డి ,గజేంద్ర, అమరేష్, జాను తదితరులు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పులివర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ పాలనలో దళితులకు స్వేచ్ఛ కరువైందన్నారు. దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి దగా చేసిందన్నారు. దళితులు అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలంటే చంద్రబాబు సీఎం కావాలని, పులివర్తి నాని ఎమ్మెల్యే కావాలని చెప్పారు. ప్రతిఒకరు రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని ఆయన కోరారు.