ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్ సర్వర్ పాషా
Updated on: 2024-05-08 06:32:00
బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్..! బీఆర్ఎస్ పట్టణ సెక్రెటరీ వన్నాడ వెంకటేష్ గౌడ్ అదే దారి షాద్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ సర్వర్ పాషా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పట్టణ బీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ వన్నాడ వెంకటేష్ గౌడ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సెక్యులరిజమే ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకు మానవతావాదులు దూరంగా ఉంటారని అన్నారు. వంశీ చంద్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం సీనియర్ నాయకుడు డంగు శ్రీనివాస్ యాదవ్, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మైనార్టీ నేత జమ్రుత్ ఖాన్, గిరిజన నేత శీను నాయక్ ప్రకాష్, అగ్గనూరు బసవమప్ప, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.