ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు..
Updated on: 2024-05-15 06:45:00
సగర భగీరథ మహర్షి మహా జ్ఞాని,పరోపకారానికి పెట్టింది పేరు అని, దీక్షకు, సహనానికి ప్రతిరూపం అని, ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించాడని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ అన్నాడు.. సగర భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి, బిసి కుల సంఘ పెద్దలు, నాయకుల సమక్షంలో ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరిగింది.. ఎవరైనా కఠోర శ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటామని , దానికి ప్రత్యక్ష దైవంగా భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడనీ శ్రీనివాస్ సాగర్ కొనియాడారు.. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సవారి సత్యం,దేవరకద్ర బీసీ సమాజ్ నియోజక వర్గ కన్వీనర్ శేఖర్, జండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్, రజక రిజర్వేషన్ జాతీయ అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ డికె నాయి, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, ముదిరాజ్ సంఘం నాయకులు గంజి ఆంజనేయులు, రజక రిజర్వేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు శివన్న, బీసీ సమాజ్ సభ్యులు సుక్కలి భాస్కర్, మల్లేష్, కోళ్ల రాజు, ఆంజనేయులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు