ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు..
Updated on: 2024-05-15 06:45:00

సగర భగీరథ మహర్షి మహా జ్ఞాని,పరోపకారానికి పెట్టింది పేరు అని, దీక్షకు, సహనానికి ప్రతిరూపం అని, ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించాడని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ అన్నాడు.. సగర భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి, బిసి కుల సంఘ పెద్దలు, నాయకుల సమక్షంలో ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరిగింది.. ఎవరైనా కఠోర శ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటామని , దానికి ప్రత్యక్ష దైవంగా భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడనీ శ్రీనివాస్ సాగర్ కొనియాడారు.. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సవారి సత్యం,దేవరకద్ర బీసీ సమాజ్ నియోజక వర్గ కన్వీనర్ శేఖర్, జండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్, రజక రిజర్వేషన్ జాతీయ అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ డికె నాయి, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, ముదిరాజ్ సంఘం నాయకులు గంజి ఆంజనేయులు, రజక రిజర్వేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు శివన్న, బీసీ సమాజ్ సభ్యులు సుక్కలి భాస్కర్, మల్లేష్, కోళ్ల రాజు, ఆంజనేయులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు