ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ఓడిపోతామన్న అసూయతోనే వైసీపీ గుండాల దాడులు: సత్యకుమార్ యాదవ్
Updated on: 2024-05-15 07:01:00
కేతిరెడ్డి దౌర్జన్యాలకు ముగింపు పలకడానికే నేను వచ్చా * వైసీపీ రౌడీల దాడిలో గాయపడిన ప్రజలను పరామర్శించిన సత్యకుమార్ యాదవ్ ఎన్నికల్లో ప్రజలు కేతిరెడ్డికి వ్యతిరేకంగా ఓటేయడంతో తన ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాడని ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఓబుల నాయన పల్లి, చిన్నూరు బత్తలపల్లి గ్రామస్తులపై మంగళవారం వైసీపీ గుండాలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. ధర్మవరంలో కేతిరెడ్డి రౌడీయిజానికి పతనం ప్రారంభమైందని, ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ధర్మవరంలో తన అధ్యాయం ముగుస్తుందని తెలుసుకున్న కేతిరెడ్డి ఇలా ప్రజలపై దాడులు చేయిస్తూ తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని చెప్పారు. ధర్మవరం వాసులు ఎవరు ఇకమీదట భయపడాల్సిన అవసరం లేదని, కేతిరెడ్డి రౌడీ రాజ్యానికి ముగింపు పలకడానికే తాను ఇక్కడికి వచ్చానని, అధికారంలోకి రాగానే కేతిరెడ్డి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెడతానన్నారు. వైసిపి గూండాలకు గడ్డుకాలం రాబోతోందని, ప్రజల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని చెప్పారు.