ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
కందివనం యువకుడి నిరసనకు స్పందించిన అధికారులు గ్రామలలో బెల్ట్ షాపులు ఉంటే వారిపై కఠిన చర్యలు
Updated on: 2024-05-20 14:02:00
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మే 20(పోలీస్ నిఘా):రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నవీన్ అనే యువకుడు గ్రామంలో విచ్చల వీడియో మద్యం అమ్మకాలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశాడు.తమ గ్రామంలో బెల్ట్ షాపులు సమూలంగా నిర్ములించాలని, ఉన్న షాపులన్ని మూసేయ్యలని,గ్రామంలో 24 గంటలు బెల్ట్ షాపులు తెరచి ఉంచుతున్నారని, యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి పాలవుతున్నారు. పనులు మానేసి తాగడమే పనిగా పెట్టురుకున్నారని, గ్రామంలో బెల్ట్ షాపులు మూసివేయాలని,ఈరోజు ఉదయం అబ్కారి స్టేషన్ నందు ఫిర్యాదు అందించాడు. నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసాం అని తెలిపారు. అబ్కారి అధికారి టీ.శేఖర్ మాట్లాడుతూ,, ఫరక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నిన్న నిరసన చేసిన యువకుడు నవీన్ ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి తనిఖీలు చేయగా ఇద్దరి దగ్గర మద్యం లభించినట్టు తెలిపారు. ఇద్దరు పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరికొందరి ఇండ్లలో సోదాలు చేయగా ఎలాంటి మద్యం లభించలేదు. గ్రామంలో గతంలో మద్యం అమ్మిన వారిని మరియు ఇప్పుడు దొరికిన వారిని స్టేషన్ పిలిపించి మాట్లాడడం జరిగిందన్నారు. కేసు నమోదైన వారిని ఈరోజు తాసిల్దార్ దగ్గర హాజరు పరుస్తామని తెలిపారు. తాలుకలో ఏ గ్రామంలో మద్య మకాలు ఉన్న తక్షణమే అబ్కారి స్టేషన్ కు ఫిర్యాదు చేయగలరని మనవి.