ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
భారీగా వాహనాలు స్వాదీనం
Updated on: 2024-05-21 13:52:00
అనకాపల్లి - జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఆదేశాల మేరకు పరవాడ సబ్ డివిజన్, ఎలమంచిలి సర్కిల్ సిఐ గఫూర్ ఆధ్వర్యంలో మునగపాక ఎస్సై ప్రసాదరావు,పరవాడ సబ్ డివిజన్ సిఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది తో నాగులాపల్లి గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి భారీ ఎత్తున రికార్డ్స్ లేని ద్విచక్ర వాహనాలు, ఆటోను మొత్తం 42 వాహనాలను మునగపాక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి సిఐ నాగులాపల్లి గ్రామస్తులతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అనుమానస్పద ప్రాంతాల్లో ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. గ్రామస్తులు ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన రాదని హెచ్చరించారు.