ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
భారీగా వాహనాలు స్వాదీనం
Updated on: 2024-05-21 13:52:00

అనకాపల్లి - జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఆదేశాల మేరకు పరవాడ సబ్ డివిజన్, ఎలమంచిలి సర్కిల్ సిఐ గఫూర్ ఆధ్వర్యంలో మునగపాక ఎస్సై ప్రసాదరావు,పరవాడ సబ్ డివిజన్ సిఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది తో నాగులాపల్లి గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి భారీ ఎత్తున రికార్డ్స్ లేని ద్విచక్ర వాహనాలు, ఆటోను మొత్తం 42 వాహనాలను మునగపాక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి సిఐ నాగులాపల్లి గ్రామస్తులతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అనుమానస్పద ప్రాంతాల్లో ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. గ్రామస్తులు ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన రాదని హెచ్చరించారు.