ముఖ్య సమాచారం
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
Updated on: 2024-05-25 08:29:00

నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. నకిలీ, కాలంచెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగులమందులు అమ్మితే సహించేది లేదని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ప్రతి దుకాణం ఎదుట ఎరువులు, విత్తనాల ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీలర్ షాప్ లైసెన్స్ వివరాలను ప్రదర్శించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులను విక్రయించాలన్నారు. విత్తనాలు, ఎరువుల నిల్వల వివరాలను రోజువారీగా రిజిష్టర్లలో పొందుపరచాలని చెప్పారు. రైతులు విత్తనాల ఖాళీ సంచులను పంటకాలం పూర్తయ్యే దాకా భద్రపరుచుకోవాలని, ఒకవేళ రైతు నష్టపోయినట్లయితే ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు, డీలర్లు, ఫెర్టిలైజర్స్ యజమానులు పాల్గొన్నారు.