ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
Updated on: 2024-05-25 08:29:00
నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. నకిలీ, కాలంచెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగులమందులు అమ్మితే సహించేది లేదని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ప్రతి దుకాణం ఎదుట ఎరువులు, విత్తనాల ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీలర్ షాప్ లైసెన్స్ వివరాలను ప్రదర్శించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులను విక్రయించాలన్నారు. విత్తనాలు, ఎరువుల నిల్వల వివరాలను రోజువారీగా రిజిష్టర్లలో పొందుపరచాలని చెప్పారు. రైతులు విత్తనాల ఖాళీ సంచులను పంటకాలం పూర్తయ్యే దాకా భద్రపరుచుకోవాలని, ఒకవేళ రైతు నష్టపోయినట్లయితే ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు, డీలర్లు, ఫెర్టిలైజర్స్ యజమానులు పాల్గొన్నారు.