ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ధర్మవరం డిపోకు 4 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు
Updated on: 2024-05-27 10:55:00
ధర్మవరం ఆర్టీసీ డిపోకు 4 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఇటీవలే రావడం జరిగిందని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రయాణికుల తాత్కాలిక అవసరాల దృష్ట్యా బీహెచ్ఈఎల్ కు, సికింద్రాబాద్కు, హైదరాబాదుకు పంపడం జరుగుతుందని తెలిపారు. మరొక బస్సు శని, ఆదివారాలలో ప్రత్యేకంగా దూరప్రాంతాలకు పంపడం జరుగుతోందని తెలిపారు. జూలై నెలలో 25 బస్సులు జిల్లాకు రానున్నాయని, అదేవిధంగా కొత్త బస్సులు కూడా ధర్మారం డిపోకు రానున్నాయని తెలిపారు. ప్రయాణికుల సుఖ ప్రయాణము కొరకు కొత్త బస్సులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ధర్మారం డిపో నుంచి అనేక బస్సులు వివిధ దూర ప్రాంతాలకు, జిల్లాలలో సర్వీసులు నడుస్తున్నాయని. ప్రయాణికులకు ఎక్కడ ఏదైనా సమస్య ఎదురైతే ధర్మవరం డిపో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రయాణికుల సంక్షేమమే మా ఆర్టీసీ దేయమని వారు తెలిపారు.