ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
విద్యుత్ కోతలు లేకుండా చూడాలి
Updated on: 2024-05-31 13:01:00
అసలే రోహిణి కార్తె, ఒక పక్క ఉక్కపోత ఆపై వేళాపాళాలేని విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని కాబట్టి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కొత్తపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో శుక్రవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. వేళాపాళాలేని కరెంటు కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రాత్రివేళలో మరీ ఎక్కువుగా ఉంటుందని వాపోయారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరా పూర్తి స్దాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.