ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
విద్యుత్ కోతలు లేకుండా చూడాలి
Updated on: 2024-05-31 13:01:00

అసలే రోహిణి కార్తె, ఒక పక్క ఉక్కపోత ఆపై వేళాపాళాలేని విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని కాబట్టి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కొత్తపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో శుక్రవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. వేళాపాళాలేని కరెంటు కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రాత్రివేళలో మరీ ఎక్కువుగా ఉంటుందని వాపోయారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరా పూర్తి స్దాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.