ముఖ్య సమాచారం
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
ఇకనుండి ధర్మవరం అభివృద్ధి బాధ్యత నాది- - ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-06-05 19:04:00

ధర్మవరం , జూన్ 5 : సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ముమ్మాటికి ధర్మవరం ప్రజల గెలుపేనని ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్య కుమార్ యాదవ్ ను అభినందనలు తెలియజేయడానికి పట్టణంలోని బిజెపి కార్యాలయానికి బుధవారం వేలాది ప్రజలు తరలివచ్చారు. ఉదయం నుండి బిజెపి టిడిపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు గజమాలలు , పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్య కుమార్ కు అభినందనలు తెలిపారు. వేలాది ప్రజలు గుమి కూడడంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఆదరించి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన ధర్మవరం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు కేతిరెడ్డి అరాచక పాలనలో అభివృద్ధికి దూరమైన ధర్మవరం నియోజకవర్గాన్ని జాతీయస్థాయిలో పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమ ఓటు ద్వారా రాక్షస రాజ్యానికి అంతం పలికారని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని చెప్పారు. గత ఐదేళ్లుగా అరాచకాలు కబ్జాలు రౌడీయిజం వల్ల కష్టాలు పడిన ప్రజలు ఇకపై ప్రశాంతంగా ఉండవచ్చని చెప్పారు.