ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
అధినేత చంద్రబాబు,లోకేష్ లను కలిసిన ఎమ్మెల్యే ఏలూరి
Updated on: 2024-06-06 18:44:00
హ్యాట్రిక్ విజేతగా నిలిచిన ఏలూరికి అభినందనలు తెలిపిన నేతలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ అద్భుతమైన ఘనవిజయం సాధించడం పట్ల అధినేతకు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హ్యాట్రిక్ విజేతగా నిలిచిన ఎమ్మెల్యే ఏలూరిని అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం యువ నేత నారా లోకేషను కలిశారు. ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు. పర్చూరు నియోజకవర్గం చరిత్రను తిరగరాసి భారీ మెజారిటీలో రికార్డు బద్దలు చేయడం పట్ల లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఏలూరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ అపార అనుభవం ముందుచూపుతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు. అనంతరం పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.