ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ప్రజలకు అవినీతి లేని పాలన అందించాలి ... ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
Updated on: 2024-06-14 06:58:00
బాపట్ల: పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పురపాలక సంఘం అధికారులతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు తోలి రివ్యూ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో దోమల బెడద అధికంగా ఉందని దోమల నివారణకు అధికారులు తీవ్ర కృషి చేయవలసిన బాధ్యత ఉందన్నారు. అవినీతి లేని పాలన అందించడానికి అధికారులు ముందుకు వెళ్లాలని సూచన చేశారు.పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించి పురవీధులన్నీ పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేసే ప్రజలకు జవాబుదారులుగా నిలవాలని సూచనలు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని ప్రతి రోజూ డ్రైనేజీలను పరిశుభ్ర పరుస్తూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.అన్ని వార్డులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వెళుతున్నానని వివరించారు.పారిశుధ్య కార్మికులను ప్రజా ప్రతినిధులు,అధికారుల నివాసాలలో పనులకు పంపించకుండా ఉండాలని ప్రభుత్వ జీతాలు ఇస్తూ అధికారుల నివాసాలలో ప్రజాప్రతినిధుల నివాసాలలో పనులు చేయిస్తే సహించేది లేదన్నారు. స్వయంగా ప్రతి ఒక్క పాశుద్ధ్య కార్మికుడితో తాను మాట్లాడతానని పాశుద్ధ్య కార్మికుల సమస్యలు అన్నిటికీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అవినీతి లేని పాలన చేసి ప్రభుత్వానికి మంచి పేరు అధికారులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.