ముఖ్య సమాచారం
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
ప్రజలకు అవినీతి లేని పాలన అందించాలి ... ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
Updated on: 2024-06-14 06:58:00

బాపట్ల: పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పురపాలక సంఘం అధికారులతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు తోలి రివ్యూ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో దోమల బెడద అధికంగా ఉందని దోమల నివారణకు అధికారులు తీవ్ర కృషి చేయవలసిన బాధ్యత ఉందన్నారు. అవినీతి లేని పాలన అందించడానికి అధికారులు ముందుకు వెళ్లాలని సూచన చేశారు.పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించి పురవీధులన్నీ పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేసే ప్రజలకు జవాబుదారులుగా నిలవాలని సూచనలు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని ప్రతి రోజూ డ్రైనేజీలను పరిశుభ్ర పరుస్తూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.అన్ని వార్డులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వెళుతున్నానని వివరించారు.పారిశుధ్య కార్మికులను ప్రజా ప్రతినిధులు,అధికారుల నివాసాలలో పనులకు పంపించకుండా ఉండాలని ప్రభుత్వ జీతాలు ఇస్తూ అధికారుల నివాసాలలో ప్రజాప్రతినిధుల నివాసాలలో పనులు చేయిస్తే సహించేది లేదన్నారు. స్వయంగా ప్రతి ఒక్క పాశుద్ధ్య కార్మికుడితో తాను మాట్లాడతానని పాశుద్ధ్య కార్మికుల సమస్యలు అన్నిటికీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అవినీతి లేని పాలన చేసి ప్రభుత్వానికి మంచి పేరు అధికారులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.