ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పోలీస్ స్టేషన్లో తనిఖీ చేసిన ఎస్పీ
Updated on: 2024-06-22 15:04:00
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక శనివారం ఉదయం బుర్జా పోలీస్ స్టేషన్ ని సందర్శించి తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో ముందుగా పోలీస్ స్టేషన్ సిబ్బంది జిల్లా ఎస్పీ నకు గౌరవ వందనం సమర్పించారు.అనంతరం జిల్లా ఎస్పీ స్టేషన్ ఆవరణంలో పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎటువంటి అనాధికారమైన కేసు ప్రాపర్టీని స్టేషన్లో ఉంచకుండా కోర్టు ఉత్తర్వులు మేరకు డిస్పోజల్ చేయాలని సూచించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, ముఖ్యమైన కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తుపై అధికారులను అడిగి తెలుసుకుని,దర్యాప్తుపై దిశానిర్దేశాలు చేశారు. బాధితులు,పిర్యాదు దారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలఫై సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం న్యాయం చేయాలన్నారు. నాటు సారా,గంజాయి వంటి మాదక ద్రవ్యాలు క్రయ, విక్రయాలు,అక్రమ రవాణా ను అరికట్టాలని, మాదకద్రవ్యాలు వినియోగం వలన కలిగే దుష్ప్రభావలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.రహదారి ప్రమాదాల నివారణకు ప్రణాళిక మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ వెంట ఆమదాలవలస సీఐ దివాకర్, బుర్జ ఎస్ఐ ఉన్నారు.