ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
మీకోసం అర్జీలు సత్వరం పరిష్కరించాలి
Updated on: 2024-06-24 14:40:00
శ్రీకాకుళం: మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు సత్వరం ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తో పాటు జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతి రావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డిఎ, పి.డి కిరణ్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 148 అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో కెఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, జెడ్పి సిఇఓ డి.వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి బి.మీనాక్షి, డ్వామా పి.డి చిట్టి రాజు, డిసిహెచ్ఎస్ డా.రాజ్యలక్ష్మి, హౌసింగ్ పి.డి గణపతి రావు, ఇరిగేషన్ ఎస్.ఇ రాంబాబు, జిల్లా ఉద్యాన అధికారి ఆర్.వి ప్రసాద రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.