ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
కూటమి ప్రభుత్వం లో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత - ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
Updated on: 2024-07-10 17:35:00
కూటమి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో RMC పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మిస్తున్న మాత శిశు నూతన భవన నిర్మాణంతో పాటు పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు విభాగం త్వరలోనే అందుబాటులో రానున్నదని, రామ్ కానా కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనారాయణ పరిరక్షణలో బిల్డింగ్ పనులు చేయడం జరుగుతుందనని, రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నార్త్ అమెరికా సహకారంతో రూ.30 కోట్లుతో బిల్డింగ్ నిర్మాణానికి చేపట్టడం జరుగుతుందని, గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారన్నారు.
1150 పడగల ఆసుపత్రి అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు పడకలో సరిపోవడం లేదని, నూతన బిల్డింగ్ అందుబాటులోకి వస్తే 500 పడకలు గర్భిణీ చిన్నారులకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు, డాక్టర్ లావణ్య కుమారి, రామ్ కానా... రాంకోస సభ్యులు డాక్టర్ చిట్లకిరణ్ కుమార్, డాక్టర్ తేజో కృష్ణ, డా. అరుణ ఆదిత్య, డా ఆనంద్, డాక్టర్ కొండమూరి సత్యనారాయణణ, మల్లిపూడి వీరు, నల్లూరి శ్రీనివాస్, సంగిశెట్టి అశోక్, మల్లాడి గంగాధరం తదితరులు పాల్గొన్నారు.