ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
గుండ్లకమ్మ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలి జిల్లా కలెక్టర్
Updated on: 2024-07-12 18:59:00
మద్దిపాడు జూలై 12 గుండ్లకమ్మ రిజర్వాయర్ చివరి ఆయకట్టు రైతులకు తక్షణం సాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అమీము్ అన్సరియా అన్నారు శుక్రవారం గుండ్లకమ్మ రిజర్వాయర్ను సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ ప్రాజెక్టులో జరుగుతున్న మరమ్మత్తుల పనులను పూర్తి చేయాలన్నారు.12 గేట్లు ను సైట్ ఇంజనీర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గేట్లకు సాండ్ బ్లాస్టింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ ను వెల్లడించారు. పనులు జాప్యం లేకుండా చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్టు కింద నీటి సరఫరా భూ సేకరణ అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇరిగేషన్ ఎస్సీ నాగ మురళీమోహన్ కలెక్టర్కు వివరించారు. కుడి కాలువ క్రింద 28 వేల ఎకరాలకు నీరు అందించేలా పూడికలు తీసి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసినట్లు కలెక్టర్కు తెలిపారు. ఎడమ కాలు క్రింద భూసేకరణకు సమస్యలు తలెత్త డంతో వర్క్ ఆర్డర్ ను ప్రభుత్వం రద్దు చేసిందని కలెక్టర్కు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీవో జీవి సుబ్బారెడ్డి తాసిల్దార్ అనురాధ ఇరిగేషన్ డి ఈ కే నాగరాజు ఏఈ వై రామాంజనేయులు రెవిన్యూ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.