ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
గుండ్లకమ్మ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలి జిల్లా కలెక్టర్
Updated on: 2024-07-12 18:59:00
మద్దిపాడు జూలై 12 గుండ్లకమ్మ రిజర్వాయర్ చివరి ఆయకట్టు రైతులకు తక్షణం సాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అమీము్ అన్సరియా అన్నారు శుక్రవారం గుండ్లకమ్మ రిజర్వాయర్ను సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ ప్రాజెక్టులో జరుగుతున్న మరమ్మత్తుల పనులను పూర్తి చేయాలన్నారు.12 గేట్లు ను సైట్ ఇంజనీర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గేట్లకు సాండ్ బ్లాస్టింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ ను వెల్లడించారు. పనులు జాప్యం లేకుండా చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్టు కింద నీటి సరఫరా భూ సేకరణ అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇరిగేషన్ ఎస్సీ నాగ మురళీమోహన్ కలెక్టర్కు వివరించారు. కుడి కాలువ క్రింద 28 వేల ఎకరాలకు నీరు అందించేలా పూడికలు తీసి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసినట్లు కలెక్టర్కు తెలిపారు. ఎడమ కాలు క్రింద భూసేకరణకు సమస్యలు తలెత్త డంతో వర్క్ ఆర్డర్ ను ప్రభుత్వం రద్దు చేసిందని కలెక్టర్కు తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీవో జీవి సుబ్బారెడ్డి తాసిల్దార్ అనురాధ ఇరిగేషన్ డి ఈ కే నాగరాజు ఏఈ వై రామాంజనేయులు రెవిన్యూ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.