ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించండి - నీటిపారుదల శాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర ఎమ్మెల్యేలు
Updated on: 2024-07-16 08:04:00
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు తదితర ఎమ్మెల్యేలు కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరియు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులు కలిసి మంత్రికి విజ్ఞాపన చేశారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణంతో షాద్ నగర్, పరిగి, చేవెళ్ల, తాండూరు నియోజకవర్గ ప్రజలు సాగు కష్టాలను తీర్చవచ్చని తెలియజేసి నిధుల మంజూరుకు ఒప్పించడం జరిగిందని వారు మీడియాతో పేర్కొన్నారు.
మొబైల్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్
షాద్ నగర్ పట్టణంలోని జడ్చర్ల రహదారిలో ఓ మొబైల్ షాపును స్థానిక ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ తదితరులు ప్రారంభించారు. యువత స్వయం ఉపాధి వైపు దూసుకుపోవాలని వారికి ప్రభుత్వ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. యువత ఆర్థిక రంగం వైపు దృష్టిసాదించడం మంచి పరిణామం ఈ సందర్భంగా మొబైల్ నిర్వాహకులను అభినందించారు.