ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
విజయ హై స్కూల్ లో ఘనంగా రక్షాబంధన్
Updated on: 2024-08-17 17:19:00
విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ పండుగను ఘనంగా నిర్వహించారు నిర్వహించారు విజయ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ముఖ్య అతిథి రాజుల వారి దిగంబర్ (ఏకలవ్య ఫౌండేషన్ మెంబర్) మాట్లాడుతూ దేశాన్ని రక్షించుకునే బాధ్యత అందరిదీ అని భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చిన్న పెద్ద జాతి భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు . దేశ రక్షణ కి ప్రేరణ రక్షా బంధన్అని తెలిపారు. రాఖీ పౌర్ణమి విశిష్టతను తెలియజేస్తూ తెలుగు ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ టి. కె. వి రామానుజాచార్యులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. పూర్వం రక్షకట్టి వేదాలు నేర్పే వారని మనందరం దేశాన్ని రక్షించుకోవాలని నీకు నేను రక్ష నీవు నాకు రక్ష మనందరం దేశానికి రక్ష అని తెలిపారు. పాఠశాల విద్యార్థినులు విద్యార్థులకు "రక్ష "కట్టారు. ఈ కార్యక్రమంలో గొల్ల వెంకటేశ్వర్ మంచిరాల నాగభూషణం , ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీరం విజయలక్ష్మి , ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.