ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
ఎన్.వి.రమణను చైర్మన్ చేసేందుకు మార్గం సుగుమం
Updated on: 2024-09-22 07:41:00
తిరుమలలో లడ్డూపై ప్రపంచవ్యాప్తంగా వివాదం నెలకొంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది.పవిత్రమైన లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
.టీటీడీ చైర్మన్ పదవి గత కొంత కాలంగా ఖాళీగా ఉంది.ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీ నేత తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం,జనసేన,బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే టీటీడీపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో అత్యంత కీలకమైన,ప్రతిష్ఠాత్మక పదవి కావడం వల్ల ఛైర్మన్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.తొలుత ఈ పదవికి నాగబాబును అనుకున్నారు.నాగబాబు పేరును పవన్కల్యాణ్ రిఫర్ చేశారని వార్తలు వచ్చాయి.ఆ తర్వాత ఈ వార్తలు నిజంకావని తేలడంతో నాగబాబు పేరు పక్కకిపోయింది.ఇక మరోపేరు టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడు తెరపైకి వచ్చింది.ఏపీలో కూటమి ప్రభుత్వం రావడానికి టీవీ5 కృషి చేసిన నేపథ్యంలో రిటర్న్గిఫ్ట్గా బీఆర్నాయుడుకు ఆ పదవి ఇస్తారని భావించారు.కానీ తాజాగా మారోపేరు ప్రచారంలోకి వచ్చింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ ఎన్.వి.రమణను నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కీలకమైన ఈ పోస్టుకు ఎన్.వి.రమణ పేరును ఖరారు చేయనున్నారని సమాచారం.ప్రస్తుతం ఎన్.వి.రమణ,బి.ఆర్.నాయుడు పేర్లే వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరిని టీటీడీ చైర్మన్గాచే చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.చంద్రబాబు ప్రాధాన్యత మాత్రం ఎన్.వి.రమణకే ఉన్నట్లు తెలుస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో ఎన్.వి.రమణను నియమించి టీటీడీని గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట.