ముఖ్య సమాచారం
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
రతన్ టాటా మృతితో భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. శాసనసభ్యులు వనమాడి కొండబాబు
Updated on: 2024-10-10 18:59:00

పారిశ్రామిక దిగ్గజం మానవతా మూర్తి విలువలతో కూడిన వ్యాపారవేత్త రతన్ టాటా గారని, రతన్ టాటా మృతితో భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందిని శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసి కొండబాబు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగిన వ్యక్తి రతన్ టాటా ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందారని, గొప్ప మానవతా మూర్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, తన సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారని, ముఖ్యంగా కరోనా సమయములో భారీ విరాళం అందించారని, స్థిరమైన వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి విలువలతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పరిచారని, వ్యాపార రంగంలో చెరగని ముద్ర వేశారని, దూర దృష్టితో ఆలోచించి వ్యాపార రంగంలో అడుగులు వేసి సక్సెస్ సాధించారని, ప్రపంచ వ్యాప్తంగా 100 కుపైగా దేశాలలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన రతన్ టాటా ఎందరికో ప్రత్యక్షంగా పరోక్షంగా మరేందరికో ఉపాధికి కారకులయ్యారని, కష్టపడే తత్వం సేవా దృక్పధం ఆయన స్థాయిని పెంచాయిని, టాటా కంపెనీ అంటే ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించారని, రతన్ టాటా మృతి యావత్ భారతదేశాన్ని కదిలించిందని, భారతదేశం గొప్ప వ్యాపారవేత్తని మానవతా మూర్తిని కోల్పోయిందిని తెలిపారు.