ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
రతన్ టాటా మృతితో భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. శాసనసభ్యులు వనమాడి కొండబాబు
Updated on: 2024-10-10 18:59:00
పారిశ్రామిక దిగ్గజం మానవతా మూర్తి విలువలతో కూడిన వ్యాపారవేత్త రతన్ టాటా గారని, రతన్ టాటా మృతితో భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందిని శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసి కొండబాబు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగిన వ్యక్తి రతన్ టాటా ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందారని, గొప్ప మానవతా మూర్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, తన సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారని, ముఖ్యంగా కరోనా సమయములో భారీ విరాళం అందించారని, స్థిరమైన వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి విలువలతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పరిచారని, వ్యాపార రంగంలో చెరగని ముద్ర వేశారని, దూర దృష్టితో ఆలోచించి వ్యాపార రంగంలో అడుగులు వేసి సక్సెస్ సాధించారని, ప్రపంచ వ్యాప్తంగా 100 కుపైగా దేశాలలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన రతన్ టాటా ఎందరికో ప్రత్యక్షంగా పరోక్షంగా మరేందరికో ఉపాధికి కారకులయ్యారని, కష్టపడే తత్వం సేవా దృక్పధం ఆయన స్థాయిని పెంచాయిని, టాటా కంపెనీ అంటే ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించారని, రతన్ టాటా మృతి యావత్ భారతదేశాన్ని కదిలించిందని, భారతదేశం గొప్ప వ్యాపారవేత్తని మానవతా మూర్తిని కోల్పోయిందిని తెలిపారు.