ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
కోడిపందాల శిబిరంపై మెరుపు దాడి చేసిన కొయ్యలగూడెం పోలీసులు
Updated on: 2024-12-03 09:15:00
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు పోలవరం డిఎస్పి,సిఐ ల స్వీయ పర్యవేక్షణలో అర్ధరాత్రి కోయ్యలగూడెం ఎస్ఐ చంద్రశేఖర్ కి రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో కలిసి గవరవరం గ్రామం శివారులో కోడి పందాలు స్థావరం పై దాడులు నిర్వహించి 20 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,23,130 రూపాయలను 05 మోటార్ సైకిల్ లను మరియు 02 కోడి పుంజులను స్వాధీనం చేసుకొని వారి పై కోయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా కొయ్యలగూడెం ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు అనగా కోడి పందెలు పేకాట లు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా కోడి పందెలు,పేకాటలో నిర్వహిస్తున్నటు వంటి సమాచారాన్ని డయల్ 112 కు గాని లేదా కోయ్యాల గూడెం ఎస్సైగారి యొక్క ఫోన్ నెంబర్ 9440796666 నకు సమాచారం అందించిన ఎడల చట్ట ప్రకారం జూదరుల పై చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆన్నారు.