ముఖ్య సమాచారం
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
ట్రిపుల్ ఐటీ నూజివీడు మెటలర్జీ ఇంజనీరింగ్ విద్యార్థులు ‘కె.సి.పి ఇంజనీర్స్ ప్రై. లిమిటెడ్’ కంపెనీ ఉద్యోగానికి ఎంపిక
Updated on: 2024-12-16 17:00:00

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజిలోని మెటలర్జీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు నీలపు.శ్రీవాణి, ఎన్.క్రాంతికుమారి,కె.హేమలత,కె.మమతాంజలి,వై.మంజుల మద్రాసుకు చెందిన కె.సి.పి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యారు.ఎంపికైన విద్యార్థులందరినీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ అభినందించారు.నేటి విద్యార్థులందరూ సాఫ్ట్ వెర్ ఉద్యోగాల వైపే పరిమితమవడం కాకుండా,కోర్ ఇంజనీరింగ్ బ్రాంచిలలో కూడా మెరుగైన అవకాశాలున్నాయని తెలుసుకోవాలన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా మెటలర్జీ విభాగ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి,ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారని డైరెక్టర్ తెలియజేసారు.ఈ సంవత్సరం వంద శాతం ఉద్యోగాల కల్పనతో మెటలర్జీ విభాగం విద్యార్థులు ముందంజలో ఉన్నదని తెలియజేసారు.దేశానికి మెటలర్జీ విభాగంలో ఉదోగార్థుల కొరత ఉందనీ,ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనీ, విభాగాధిపతి డాక్టర్.బి. వెంకటేశ్వర్లు తెలియజేసారు.జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కూడా నూజివీడు మెటలర్జీ విభాగ విద్యార్థులు రాణించి,అవకాశాలను అందిపుచ్చుకుని స్థిరపడ్డారని తెలియజేసారు.